Saturday, July 27, 2019

ఆంధ్ర కొత్త సి.ఎం ఈ విషయంలో ఎందుకు తొందరపడుతున్నారో ?

              ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం తెలంగాణ తో కలిసి గోదావరి జలాల వినియోగం పేరుతో మరో చారిత్రాత్మక తప్పిదం చేయబోతుందా అంటే ప్రస్తుతానికి అవుననే అభిప్రాయం ఆంధ్ర ప్రజల్లో నెలకొని ఉంది.

              రాష్ట్ర విభజనతో హైదరాబాద్ పైన హక్కుతో పాటు ఎన్నో ఆస్తులు కోల్పోయారు ఆంధ్రా ప్రజలు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం అమరావతి పైన విషం కక్కుతుంది. హైదరాబాద్ ని తలదన్నే రాజధాని నవ్యాంధ్ర ప్రదేశ్ లో రూపుదిద్దుకోబోతుందనే ఆశలపైన కొత్త ప్రభుత్వం నీళ్ళు చల్లింది.

              ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ ల పైన దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన ప్రభుత్వం తెలంగాణ తో నీటి జలాల వినియోగం లో తొందర పడుతుందనేది సగటు ఆంధ్రుడి ఆవేదన.

              నీరే జీవితం, నీరే భవిష్యత్ తరాలకు ఆధారం. చెన్నై , బెంగళూరు ల లో నీటి కష్టాలు, కర్నాటక-తమిళనాడు  మద్య వివాదాలు తెలిసిందే. నిపుణుల కమిటీ తో చర్చించి, ఎగువన ఉన్న తెలంగాణ పైన నీటి కోసం ఆధారపడని విధంగా , తెలంగాణ తరపున వచ్చే ప్రతిపాదన ని గుడ్డిగా ఆమోదించకుండా పూర్తి ప్రాజెక్ట్ ఆంధ్ర ప్రదేశ్ భుభాగం గుండా వెళ్ళే విధంగా తక్కువ ఖర్చుతో కూడినదైతేనే ఆమోదించాలి. పయ్యావుల కేశవ్ మరియు చంద్రబాబు మాటల్లో వినండి కొత్త ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటే కనుక జరిగే అనర్దాలు.  


Thursday, April 4, 2019

ఆంధ్ర ప్రదేశ్ కి 2019 లో బాబు మరలా సి.ఎం ఐతే కలిగే లాభాలేంటి?

                                                             #APwithCBNin2019




2019 అంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వోట్ వేసే ప్రతి ఒక్కరూ ఆలోచించి తెలివైన నాయకుడిని ఎన్నుకోండి.

1. పోలవరం ప్రాజెక్ట్ తప్పకుండా అనుకున్న సమయానికి పూర్తి అవుతుంది. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేక ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరించి పోలవరాన్ని పూర్తి చేయగల సత్తా ఉన్న నాయకుడు చంద్ర బాబు నాయుడు మాత్రమే.

2. క్రిష్ణా జలాల పంపిణీ విషయంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల కుయుక్తులను సమర్ధంగా ఎదుర్కొని రాష్ట్ర ప్రయోజనాలని కాపాడతాడు.

3. అమరావతి  స్వచ్చ మరియు ట్రాఫిక్ రహిత నగరంగా , ఉత్తమ నివాస యోగ్య నగరంగా, అనంద నగరంగా నిర్మించబడుతుంది. ఉపాధి మరియు పెట్టుబడుల ఆకర్షణ విషయంలో దక్షిణ భారత దేశంలో పెద్ద నగరాలైనా చెన్నై , బెంగుళూరు , హైదరాబాద్ నగరాలకు సరి తూగే ధీటైన నగరంగా అమరావతి నిలిచిపోతుంది.

4. జల రవాణా , పోర్ట్ ఆధారిత అభివృద్ధి లో దూసుకుపోతుంది. ఇచ్చాపురం నుండి తడ వరకు రూపొందించే బీచ్ రోడ్ భావనపాడు, విశాఖ , గంగవరం , కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, రామాయపట్నం, క్రిష్నపట్నం, దుగ్గరాజపట్నం పోర్ట్లను అనుసంధానిచడమే కాకుండా జాతీయ రహదారులతో అనుసంధానం జరుగుతుంది.

5. రాయలసీమ లొని అన్ని మారుమూల ప్రాంతాలకి సాగు తాగు నీరు అందించి కరవు సమస్య నివారించబడుతుంది.

6. పట్టిసీమ స్ఫూర్తి తో మరిన్ని నదుల అనుసంధానం జరుగుతుంది తద్వారా రాష్ట్రం లో తాగు సాగు నీటి కష్టాలు కనుమరుగవుతాయి. 

7. సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయి.

8. రాష్ట్రం లో ఆటో , ఫైనాన్షియల్ , మొబైల్, ఎలక్ట్రానిక్ , వైద్య పరికరాలు తయారీ, .టి తదితర రంగాల్లో అగ్ర పధంలో ముందుకెళుతుంది.  

9. అన్ని ప్రభుత్వ శాఖలు ఆన్ లైన్లో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. అన్ని ప్రభుత్వ సేవలు మొబైల్ లోకి అందుబాటులోకి వస్తాయి.  

10. సాగు నీరు సకాలంలో అందడంతోపాటు, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు తగినత పెట్టుబడి సాయం అంది వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.  

11. శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. స్మార్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో  నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుంది.

12. కేంద్రం తో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అలుపెరుగని పోరాటం కొనసాగుతుంది.

13. అన్ని ప్రాంతాలు సమతుల అభివృద్ధి  సాధిస్తాయి. 

14. ప్రత్యేక హోదా సాధించేవరకు నిరంతర ప్రయత్నాలు , పోరాటాలు చట్ట సభల ద్వారా కొనసాగుతాయి.

15. తెలంగాణతో నీళ్ళు, విభజన ఆస్తులు , కరెంట్ బకాయీల విషయంలో అంధ్ర ప్రదేశ్ ఎలాంటి రాజీ పడాల్సిన పరిస్థితి తలెత్తదు.   

India in Modi Rule 2014-24

Translate