Saturday, March 5, 2016

విజయవాడ బస్ స్టాండ్ కి కొత్త రూపు

     


                   

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారికంగా అమరావతి రాజధాని అయినప్పటికీ అనధికార రాజధాని మాత్రం ప్రస్తుతానికి విజయవాడ అన్నది అందరికి తెలిసిందే. ఎంతో ప్రాముఖ్యమున్న విజయవాడ లో సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే.

           రాష్ట్ర విభజన తరువాత ఆసియా లోనే అతి పెద్దదైన విజయవాడ బస్ స్టేషన్ కి మహర్దశ పట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పలు చర్యలు తీసుకొంది. వీటిలో భాగంగా నవ్యాంధ్రలో ఎంతో ఆర్ధిక, రాజకీయ ప్రాముఖ్యత కల్గిన విజయవాడ, గుంటూరు బస్ ప్రయాణికుల ప్రాంగణాల(బస్ స్టేషన్) నవీకరణ జరిగింది.

         1. అత్యాదునికమైన, విలాసవంతమైన సీటింగ్ సదుపాయాలు.
         2. డిజిటల్ తెరలపై బస్ ల రాకపోకల వివరాలు.
         3. సుశిక్షుతులైన సిబ్బందితో కూడిన ప్రయాణికుల సహాయ కేంద్రాలు ( హెల్ప్ డెస్క్).
         4. స్టేషన్ లో పారిశుధ్యం మెరుగుదలకు యంత్రాల వినియోగం.  
         5. డ్రైవర్లకు ఏ.సి. విశ్రాంత గదులు.
         6. అత్యాధునిక మూత్రశాలలు (టాయ్ లెట్స్)
         7. ప్రయాణికుల వినోదం కోసం ఎల్.సి.డి టి.వి లు.         
         8. ఎ.టి.ఎం సౌకర్యాలు.
         9. శుద్ధి చేసిన తాగు నీటి సదుపాయాలు.
         10. ఉచిత వై-ఫై సౌకర్యం.

     ఈ మార్పులన్ని ఆర్.టి.సి బస్ లను ప్రయాణీకులకు మరింత చేరువ చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మున్ముందు మరిన్ని అత్యాధునిక వసతులు కల్పించి విజయవాడ బస్ స్టేషన్ని తెలుగు రాష్ట్రాల్లొనే అత్యుత్తమమైన, ప్రయాణీకులకు అనుకూల బస్ స్టేషన్ గా నిలపడానికి అంధ్రా ఆర్.టి.సి చర్యలు తీసుకోవాలి. ప్రయాణీకులకు సౌకర్యాల కల్పన సంస్థ అదాయానికి ఎంతో సహకరిస్తుందనే విషయం అధికారులు గుర్తించాలి. పనిలో పనిగా ఈ కింది విషయాలపై ఆర్.టి.సి దృష్టి సారిస్తే మంచిది.

        1. డ్రైవర్లు,  కండక్టర్లు మరియు ఆర్.టి.సి సిబ్బంది ప్రయాణికులతో ఎలా సంభాషించాలో, ఓపికతో ఎలా సమాధానిమివ్వాలో తెలియజేయాలి. 
        2. 24 గంటల నాణ్యమైన ఆహార సదుపాయాలు ( 24/7 ఫుడ్ కోర్ట్స్)
        3. మంచి పార్కింగ్ సదుపాయాలు.
        4. 24 గంటల పోలీసుల పర్యవేక్షణ. 
        5. తక్షణ ఫిర్యాదుల పరిష్కార కేంద్రం.
        6. టోల్ ఫ్రీ నంబర్ కి వచ్చిన ఫిర్యాదులపైన తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలి.
        7. పట్టణ ప్రయాణీకుడ్ని, పల్లె ప్రయాణికుడ్ని సమ దృష్టితో చూడాలి.  



       
               విజయవాడ తో పాటుగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి జిల్లాలో అత్యధిక ఆదాయం ఆర్జించే మొదటి 4 బస్ స్టేషన్లు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు (పిలిగ్రిం సిటీస్), విహార కేంద్రాలు ( టూరిజం సెంటర్) ఉన్న చోట ఇలాంటి సౌకర్యాలు తక్షణం కల్పించి ప్రయాణికుద్ని రారాజు గా చూడాలి. ఇప్పటికే బస్ స్టేషన్లు ఉన్న చోట కొత్త సదుపాయాలు కల్పించి, మరిన్ని మారుమూల ప్రాంతాల్లో కొత్త బస్ స్టేషన్లు లేదా బస్ షెల్టర్లు నిర్మించాలి. 

ఆర్.టి.సి ఆదాయాన్ని పెంచేందుకు కొన్ని సూచనలు:

1. మొబైల్ యాప్ ద్వారా రిజర్వేషన్ టికెట్లను కోనుగోలు చేసేవారికి డిమాండ్ని బట్టి 10 % వరకు రాయితి ( డిస్కౌంట్) ఇవ్వాలి.
2. ముఖ్యంగా హైదరాబాద్ నుండి, విజయవాడ నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని జిల్లా కేంద్రాలకు, ముఖ్య పట్టణాలకు కనీసం రోజుకొక సర్వీస్ నడపాలి.   ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రులెందరో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధానిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి రవాణా వసతి పరంగా చేరువ చేయాల్సిన భాద్యత ఆర్.టి.సి పైన ఉంది. పండగ సమయాల్లో మరిన్ని సర్వీసులు హైదరాబాద్ నుండి నడపాలి. 

3. పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు కలిపే విధంగా దగ్గరగా ఉండే ప్రాంతాలను గుర్తించి కొత్త రూట్లను సృష్టించాలి. 



విజయవాడ  బస్ స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న సినిమా
 ధియేటర్:


India in Modi Rule 2014-24

Translate