Saturday, November 28, 2015

ఆంధ్రా ఎం.పి లూ పోరాడితే పోయేదేం లేదు!..ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు




      1956 నుండి అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఉమ్మడిగా అభివృద్ది చేసుకున్న హైదరాబాద్ అర్ధికంగా ఎంతో ఎత్తుకు ఎదిగి దేశంలో అగ్రగామి నగరంగా ఎదిగిందివిభజన తో ఆంధ్రా ప్రజలు  హైదరాబాద్ పై సర్వ హక్కుల్ని కోల్పోయారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరించాల్సి వచ్చింది.


    ఆనాడు ఆంధ్రా ప్రజల వేదన, వాదన వినే నాధులే కరువయ్యారు. కలిసి కూర్చోపెట్టి చర్చించకుండా ఎటువంటి పంపకాలు సక్రమంగా జరుపకుండా హడావుడిగా, ఎటువంటి హేతు బద్ధత లేకుండా విభజన పూర్తి చేసారు. శ్రీ క్రిష్ణ కమిటీ నివేదిక పక్కనపెట్టి ఓట్లు, సీట్లు ప్రాతిపదికన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని నిట్ట నిలువునా చీల్చారు. తరువాత ఆంధ్ర ప్రజలు తమ మాట వినని కాంగ్రెస్ ని  కనుమరుగు చేసిన సంగతి తెలిసిందే


     ఐతే ఆరోజు ప్రముఖంగా ఇచ్చిన హామీలు 2. ఒకటి ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా. రెండు పోలవరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా. ఇవి ఆంధ్రా హక్కులు.  నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజ్య సభ లో అంధ్రా కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇప్పటికి అది కలగానే మిగిలింది. రెండో ముఖ్య హామి ఐన పోలవరానికి జాతీయ హోదా ప్రకటించారు కానీ, నిధులు మాత్రం విదల్చట్లేదు, ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పట్లేదు





      ఆంధ్రా ఎం.పీ లు ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ రెండు హామీల్లో ఏ ఒక్కటీ తదుపరి ఎన్నికల్లోపు పూర్తిగా నెరవేరకపోయినా ఆంధ్రా ప్రజల అగ్రహానికి గురికాక తప్పదు, మీ రాజకీయ జీవితానికి ముగింపు తప్పదు.  విభజన వద్దని ఆరోజు ఎలా పార్లమెంట్లో పోరాడారో, విభజన హామీల సాధనకి అలాగే పోరాడాలి. మన ఆంధ్ర ప్రదేశ్ హరితాంధ్ర గా మారాలంటే పోలవరం తప్పనిసరి. మన పిల్లలకి ఉద్యోగాలొచ్చి , మన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండి దేశంలోనే అభివృద్ది  చెందిన రాష్ట్రంగా మారాలంటే ప్రత్యేక హోదా తెచ్చుకోవాల్సిందే.  





    
 ఆంధ్రా ఎం.పీ లు పార్టీలకతీతంగా ఒక్కటవ్వండి. రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రజల గురించి ఆలోచించండి. ఆంధ్రా హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడండి. ఎప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తారో, ఇంకా ఎంత కాలం నానుస్తారో  తేల్చేవరకు ప్రస్తుత సమావేశాలు జరుగనీయొద్దు.  మీ వెనక 5 కోట్ల అంధ్రా ప్రజలున్నారు. ఇక పోరు బాట మొదలు పెట్టండి. 

                                 సాధనా సాద్యతే సర్వం !!!    


   

Saturday, November 21, 2015

భారత విమానయాన రంగానికి మంచి రోజులు

       



                       యువ భారత దేశం. 125 కోట్ల జనాభా. పుంజుకుంటున్న ఆర్ధిక వ్యవస్థ. ఎన్నో అవకాశాలు. రాబోయే రోజుల్లో ప్రపంచాన్నే శాసించబోయే సత్తా ఇవన్నీ మన భారతావని ప్రత్యేకతలు.

           ఎంతో కాలంగా వివిధ కారణాల వల్ల గడ్డు కాలం ఎదుర్కొన్న భారత విమానయన రంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందా అంటే అవుననే చెప్పాలి. కింగ్ ఫిషర్ దివాలా తీయడం , ఆర్ధిక సంక్షోభం కారణంగా తగ్గిన ప్రయాణికుల సంఖ్య, విపరీతంగా పెరిగిన చమురు ధరలు, అంతకంతకు పెరుగుతున్న అప్పులు , వ్యాపార నష్టాలు ఇది ఒకప్పటి భారత విమానయన రంగం పరిస్థితి.

           ఐతే ప్రస్తుతం ఈ రంగం మీద కమ్ముకున్న నీలి నీడలు ఒక్కొకటిగా తొలిగిపోయి ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోడి ప్రభుత్వ సహకారం, అంతర్జాతీయం గా చమురు ధరల్లో తగ్గుదల, పురోగమిస్తున్న ఆర్ధిక వ్యవస్థ ఈ రంగాన్ని ఆదుకున్నాయి.  ఒక విమాన రంగ సంస్థ ఆదాయంలో 40 శాతం విమాన ఇంధనం కోసం వెచ్చించాలి. ప్రస్తుతం విమాన ఇంధన ధరలు గణనీయంగా తగ్గడం వలన ఈ రంగం లాభాల బాట పట్టబోతుంది.  గడచిన 3 త్రైమాసిక ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం అర్ధమవుతుంది.

           అజయ్ సింగ్  తిరిగి స్పైస్ జెట్ పగ్గాలు చేపట్టడం, ఏయిర్ ఇండియా కి కొత్త సియిఓ ని నియమించడం, జెట్ ఏయిర్ వేస్ లో ఇతిహాద్ వాటా కొనుగోళ్ళు , ఇండిగో మార్కెట్ల ద్వారా నిధులు సమీకరించడం, విస్తార మరియు  ఏయిర్ ఏసియా సంస్థల ప్రవేశం, మోడి ప్రభుత్వ కొత్త విమానయన రంగ విధానాలు, క్రమంగా పెరుగుతోన్న విమాన ప్రయాణీకుల సంఖ్య, చిన్న నగరాలు మరియు పట్టణాలకు విస్తరిస్తున్న విమాన సర్వీసులు , ఏయిర్ కోస్తా వంటి ప్రాంతీయ విమాన సంస్థల ఆవిర్భావం  ఇవన్నీ ఎన్నో శుభ పరిణామాలు. స్లీపర్ రైల్ టికెట్ ధరకే సామన్యుడి విమాన ప్రయాణం త్వరలో సాధ్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి. సిద్దంగా ఉండండి!

India in Modi Rule 2014-24

Translate